సీబీఎస్ఈ, ఐఎస్సీఈ వ్యవహారం.. ఉభయ విధానాల్లో పరీక్షలకు నిరాకరణ
కరోనా దృష్ట్యా కేవలం ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడం సరికాదంటూ కొందరు విద్యార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఆన్లైన్లోనూ పరీక్షలు రాసేందుకు వీలు కలిగించే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీన్ని పరిశీలించిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ వినతిని తోసిపుచ్చింది.
ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ‘‘చివరి నిమిషంలో దావాలు వేయడాన్ని మానుకోవాలి. విద్యా వ్యవస్థను కంగాళీ చేయవద్దు. అధికారులను వారి పనులను చేసుకోనీయండి. ముందే వచ్చి ఉంటే పరిశీలించి ఉండేవాళ్లం.
34 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా గందరగోళమవుతుంది’’ అని తెలిపింది. సీబీఎస్ఈ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకునే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు
0 Response to "సీబీఎస్ఈ, ఐఎస్సీఈ వ్యవహారం.. ఉభయ విధానాల్లో పరీక్షలకు నిరాకరణ"
Post a Comment