AP: ‘ఉద్యోగులను అవమానించి పంపారు





అమరావతి: పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. ఏపీ సచివాలయంలో ఇవాళ 13 ఉద్యోగ సంఘాలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ అయింది. ఈ మేరకు పీఆర్సీ అమలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ‘‘ఇవాళ కూడా ఉద్యోగులను అవమానించి పంపారు. అక్టోబర్‌ 29 నాటి భేటీలో ఇస్తామన్న పీఆర్‌సీ అమలు నివేదిక ఇంకా ఇవ్వలేదు. పీఆర్‌సీపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయన చేయడం ఏంటీ? ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని వెల్లడించారు


అమరావతి: పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని 10 ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP: ‘ఉద్యోగులను అవమానించి పంపారు"

Post a Comment