AP News: నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే తాడోపేడో తేల్చుకుంటాం





అమరావతి: ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది. ఇందులో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మాట్లాడారు. ‘‘రూ.కోట్ల వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదు.

గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాలని సజ్జల చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీఎం జగన్‌ జోక్యం చేసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలి. నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు.. తాడోపేడో తేల్చుకుంటాం’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP News: నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే తాడోపేడో తేల్చుకుంటాం"

Post a Comment