తెలుగు రాష్ట్రాల్లోని మూడు రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపుSep
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాలలోని మూడు రాష్ట్ర స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయన శనివారం ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని అమలాపురం (ఎన్హెచ్-16) నుంచి పలివేల మీదుగా రావులపాలెం(ఎన్హెచ్-216) వరకు గల రహదారిని జాతీయ రహదారిగా గుర్తించారు. పెడన (ఎన్హెచ్-216) నుంచి విస్సన్నపేట మీదుగా లక్ష్మీపురం (ఎన్హెచ్-30) వరకు గల రహదారిని నూతన జాతీయ రహదారిగా గుర్తించినట్లు ప్రకటించారు. తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రలోని విజయవాడ వరకూ గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ (నాగ్పూర్ - విజయవాడ కారిడార్లో భాగం) రహదారినీ నూతన జాతీయ రహదారిగా గుర్తించారు
0 Response to "తెలుగు రాష్ట్రాల్లోని మూడు రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపుSep"
Post a Comment