డిసెంబరు 16 నుంచి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
ప్రకటన జారీ చేసిన సీబీఎ్సఈ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)ను డిసెంబరు 16 నుంచి జనవరి 13 వరకు నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎ్సఈ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో మొత్తం 20 భాషల్లో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని.. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 19న ముగుస్తుందని తెలిపింది. పరీక్ష ఫీజును అక్టోబరు 20వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొంది. సిలబస్, పరీక్ష పేపర్ మోడల్, పరీక్ష జరిగే కేంద్రాలు తదితర వివరాల కోసం జ్ట్టిఞట://ఛ్ట్ఛ్టి.ుఽజీఛి.జీుఽలో పరిశీలించాలని సీబీఎ్సఈ సూచించింది
0 Response to "డిసెంబరు 16 నుంచి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్"
Post a Comment