త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తాం: ఆదిమూలపుSep
విశాఖ: త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో 2,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని ప్లానింగ్ బోర్డు ఏపీలోనే ఉందన్నారు. వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ వర్సిటీలను ఒకే పరిధిలోకి తెచ్చామని, విద్యకు పేదరికం అడ్డురాకూడదనే సీఎం జగన్ ఆలోచన అని తెలిపారు. విద్య, సంక్షేమంపై రూ.26 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడితే అనుమతిస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు
0 Response to "త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తాం: ఆదిమూలపుSep"
Post a Comment