✍ఎన్టీఆర్‌ ట్రస్టు* *పాఠశాలలో ఉచిత విద్య

*📚✍ఎన్టీఆర్‌ ట్రస్టు*
 *పాఠశాలలో ఉచిత విద్య✍📚*

*🌻ఈనాడు డిజిటల్‌- అమరావతి:* కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఒక్కో దానిలో పది మంది చొప్పున 40 మందికి ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 22లోగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రవేశాల కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే 25న ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. అనాథ, నిరుపేదల బాలబాలికలకు ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా 2005 సంవత్సరం నుంచి ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "✍ఎన్టీఆర్‌ ట్రస్టు* *పాఠశాలలో ఉచిత విద్య"

Post a Comment