పాఠ్యాంశాలుగా జానపద కళలుSep

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించేలా వాటిని పాఠ్యాంశాలల్లో చేర్చాలని ప్రముఖ నేపథ్యగాయకుడు వేల్‌మురుగన్‌ డిమాండ్‌ చేశారు. శీర్గాళి సమీపంలోని వైదీశ్వరన్‌ ఆలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఆలయం తరఫున ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలతో పూజారులు ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వేల్‌మురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ,  వైదీశ్వరన్‌ ఆలయం తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఆలయంలో కొలువుదీరిన వైద్యనాథస్వామిని దర్శించుకున్న తర్వాతే రాష్ట్రప్రభుత్వ కలైమామణి అవార్డు తనను వరించిందన్నారు. అలాగే, ప్రైవేటు టీవీ ఛానళ్లలో గ్రామీణ పాటలు, కళలు ప్రదర్శించే అవకాశం దక్కిందని, ఇప్పటివరకు ఐదు సినిమాల్లో నటించే భాగ్యం దక్కిందన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జానపద కళలపై ఆధారపడిన లక్షలాది మంది కళాకారులు ఆదాయం కోల్పోయారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ఈ కళాకారులకు పింఛన్లు పెంచినట్టు ప్రకటించడం స్వాగతించదగ్గదన్నారు.సంప్రదాయ కళలైన సిలం బం, గరగాట్టం,డప్పు, వీధిబాగోతం తదితర కళలను సంరక్షించే విధంగా, జానపద కళాకారుల జీవనశైలిని మెరుగుపరిచేలా ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి విద్యార్థులకు వాటి గురించి నేర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠ్యాంశాలుగా జానపద కళలుSep"

Post a Comment