విద్యార్థులకు గణేషుడి అద్భుత చరిత్ర చెప్పాలి: కేజ్రీవాల్Sep

న్యూఢిల్లీ: వినాయక చవితి ఇండియాలో ఒక అద్భుతమైన చరిత్ర అని, దానిని విద్యార్థులకు బోధించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పేర్కొన్న ఆయన.. దేశంలోని అన్ని టీవీ చానళ్లు దీనిని ప్రసారం చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిషర్ల సమయంలో వినాయక చవితి బహిరంగంగా జరుపుకునే స్వేచ్ఛ ఉండేది కాదని కేజ్రీవాల్ గుర్తు చేశారు

సాయంత్రం 7 గంటలకు గణేష్ పూజా నిర్వహిస్తున్నాం. అన్ని టీవీ చానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని కోరుతున్నాం. అలాగే దేశంలోని అందరూ ఈ కార్యక్రమాన్ని చూడాలి. బ్రిటిషర్ల సమయంలో ఇండియాలో బహిరంగంగా వినాయక చవితి నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా బహిరంగంగా వినాయక చవితి నిర్వహించారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం అనంతరం అది దేశవ్యాప్తమైంది. వినాయక చవితి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. మనం కూడా మన పిల్లల్లో భక్తినీ, దేశభక్తిని పెంపొందించాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు గణేషుడి అద్భుత చరిత్ర చెప్పాలి: కేజ్రీవాల్Sep"

Post a Comment