పదోన్నతుల్లో విద్యార్హతలకే ప్రాధాన్యత: సుప్రీం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఒకే శ్రేణి లేదా హోదా ఉద్యోగుల్లో పదోన్నతికి ఉద్యోగుల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవడమే సరైన నిర్ణయమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలా నిర్ణయించడం రాజ్యాంగంలోని 14,16 అధికరణాలను ఉల్లంఘించినట్లుగా భావించరాదని స్పష్టం చేసింది. ఒక శ్రేణి లేదా హోదా ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రారంభించడానికి విద్యార్హతలను వినియోగించుకోవచ్చని, లేదా ఇతరులను మినహాయించి పూర్తిగా ఒకే తరగతి లేదా హోదాలోని సిబ్బందికే ప్రమోషన్లను పరిమితం చేయడానికి కూడా వాడుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు తెలిపింది
0 Response to "పదోన్నతుల్లో విద్యార్హతలకే ప్రాధాన్యత: సుప్రీం"
Post a Comment