హోంజాతీయంకొవిడ్‌ బాధిత విద్యార్థులకు పరీక్ష ఫీజు లేదుSep

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజులను వసూలు చేయకూడదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. 2021-22 విద్యా సంవత్సరానికి బోర్డు పరీక్షలు రాయనున్న 10, 12 తరగతుల విద్యార్థులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. తల్లిదండ్రులిద్దరినీ లేదా ఎవరైనా ఒకరిని కోల్పోయిన విద్యార్థుల నుంచి ఈ ఫీజులు వసూలు చేయరు. అలాగే గార్డియన్లు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయినవారిని కూడా రిజిస్ట్రేషన్‌, పరీక్ష ఫీజుల నుంచి మినహాయిస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "హోంజాతీయంకొవిడ్‌ బాధిత విద్యార్థులకు పరీక్ష ఫీజు లేదుSep"

Post a Comment