పాఠశాల విద్యకు కొత్త కరిక్యులమ్ కోసం కమిటీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: పాఠశాల విద్యకు కొత్త కరిక్యులమ్ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ విద్యావిధానం-2020 డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన కె.కస్తూరిరంగన్ ఈ కమిటీకి కూడా నేతృ త్వం వహిస్తారు. పాఠశాల విద్యతోపాటు టీచర్ ఎ డ్యుకేషన్, వయోజన విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు సంబంధించి కూడా కొత్త కరిక్యులమ్లను కమిటీ తయారు చేయనుంది. జాతీయ విద్యావిధానం ద్వారా చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులను కస్తూరిరంగన్ కమిటీ సూచించనుంది. మూడేళ్లలోగా కమిటీ తన మార్గదర్శకాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
0 Response to "పాఠశాల విద్యకు కొత్త కరిక్యులమ్ కోసం కమిటీ"
Post a Comment