ఎన్‌సీసీ సంస్కరణల కమిటీలో ధోనీ, ఆనంద్‌ మహీంద్ర

దిల్లీ: విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వాన్ని పెంపొందించడంతో పాటు వారిని నిస్వార్థ సేవాపరులుగా తీర్చిదిద్దే నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌(ఎన్‌సీసీ)లో తీసుకురాదలచిన మార్పులపై రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
15 మంది సభ్యులుండే ఈ కమిటీకి ఎంపికైన వారిలో భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎం.ఎస్‌.ధోనీ, పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ఉన్నారు. మాజీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వం వహించే ఈ కమిటీలో కర్నల్‌ (రిటైర్డ్‌) రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, రాజ్యసభ ఎంపీ వినయ్‌ సహస్రబుద్ధే తదితరులనూ రక్షణ శాఖ నియమించింది. ఎన్‌సీసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీసుకురాదలచిన మార్పులపై నిపుణుల కమిటీ సమగ్ర సమీక్ష నిర్వహిస్తుంది. తగు సూచనలు చేస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎన్‌సీసీ సంస్కరణల కమిటీలో ధోనీ, ఆనంద్‌ మహీంద్ర"

Post a Comment