విజయవాడలో అవార్డుల అందజేత
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి)/ఐరాల(చిత్తూరు)/ఎ్స.రాయవరం/అనకాపల్లి టౌన్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మొత్తం 44 మందిని ఎంపిక చేయగా.. మన రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన

ఉపాధ్యాయ దినోత్సంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందించాల్సి ఉంది. అయితే.. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని అధికారులే ఈ అవార్డులను అందించారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందించారు. మన రాష్ట్రం విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎస్.పైపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.మునిరెడ్డికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను విజయవాడలో అందించారు. 1989 ఆగస్టు 17న ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన మునిరెడ్డి.. గణితంలో విద్యార్థులకు రోజువారీ తరగతులు నిర్వహించి గణితంపై ఆసక్తి పెరిగేలా చేశారు. 25 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఫణి భూషణ్ శ్రీధర్ విద్యతో పాటు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కూడా అవగాహన కల్పించారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్రం అవార్డుతో సత్కరించింది.
0 Response to "ఉత్తమ గురువులకు సత్కారం విజయవాడలో అవార్డుల అందజేత"
Post a Comment