పదో తరగతి ఫలితాల విడుదల నేడు

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలను విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. 

ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటిస్తారు. కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు. 2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది






SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదో తరగతి ఫలితాల విడుదల నేడు"

Post a Comment