NMMS దరఖాస్తు రెన్యువల్ తేదీ పొడగింపు..
పత్రికా ప్రకటన
నవంబరు 2019 లో నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లో
ఎంపిక అయిన విద్యార్ధులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్
పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొనుటకు మరియు
నవంబరు 2016, 2017, 2018 సంవత్సరములలో ఎంపిక కాబడి, గత
సంవత్సరములలో పోర్టల్ నందు నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందిన ప్రతీ
విద్యార్ధి రెన్యువల్ చేసుకొనుటకు 31-12-2020 వరకు గడువును
పొడిగించడమైనది అని జాతీయ మానవ వనరులశాఖ వారు తెలియజేసారు.
లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగాకూడా స్కాలర్షిప్ మంజూరు
కాబడదు. పాఠశాల పరిధిలో మరియు జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో
విద్యార్ధుల వివరములను ఆమోదించుటకు 15-01-2021 వరకు
పొడిగించడమైనది. కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి తప్పకుండా నేషనల్
స్కాలర్షిప్ పొర్టల్ () నందు తమ వివరములను
నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు. మరిన్ని వివరములకు సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు వెంటనే సంప్రదించవలెను అని
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
0 Response to " NMMS దరఖాస్తు రెన్యువల్ తేదీ పొడగింపు.."
Post a Comment