499 డాక్టర్‌ పోస్టులు భర్తీDec

: రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 499 మంది మెడికల్‌ ఆపీసర్ల(ఎంబీబీఎస్‌) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.



 ప్రస్తుతం 61 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 499 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు అనుమతించింది. భర్తీ ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ల కనుసన్నల్లో జరగనుంది. 


దీనికిగాను ప్రభుత్వం జిల్లా సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ కమిటీ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌లు మెంబర్లుగా ఉంటారు. కాగా, ప్రభుత్వ సర్వీసులలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసిన వైద్యులకు అత్యధికంగా 



15ు వెయిటేజీ ఇచ్చింది. దీంతో పాటు ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఏడాదిని బట్టి  10 మార్కుల వెయిటేజీని కల్పించింది. దీనిని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వైద్యులతో పాటు పీపీపీ ప్రాజెక్టులో పనిచేసిన వారికీ అమలు చేయనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "499 డాక్టర్‌ పోస్టులు భర్తీDec"

Post a Comment