ఏపీలో మొదటి రోజు తెరుచుకున్న హైస్కూళ్లు 98.84 శాతం

అమరావతి: ఏపీలో మొదటి రోజు 98.84 శాతం హైస్కూళ్లు తెరుచుకున్నాయి. స్కూళ్లకు 87.77 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. క్లాసులకు 39.62 శాతం 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 




10వ తరగతి విద్యార్థులు 43.65 శాతం మంది హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురికి కరోనా సోకింది. మర్రిపాడు మండలం నందవరం మోడల్ హైస్కూల్ వాచ్‌మెన్‌కు కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు మండలం హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలారు. 



సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుని విద్యార్థులు క్లాస్ రూంలో పాఠాలు వినేందుకు వచ్చారు. 9వ తరగతి విద్యార్థులందరికీ హాఫ్ డే, 10వ తరగతి విద్యార్థులకు ఫుల్ డే స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించింది

నవంబర్ 2వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాళ విద్యార్థులంతా స్కూళ్లకు హాజరయ్యారు. కోవిడ్ నేపధ్యంలో ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో మొదటి రోజు తెరుచుకున్న హైస్కూళ్లు 98.84 శాతం"

Post a Comment