11వ పిఆర్సి లో నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు
నోట్: ఇవి సొషియల్ మీడియా ద్వారా మాత్రమే సేకరించినవి.వీటిని అదికారికంగా దృవపరుచుకోవాల్సి ఉంటుంది.
మార్పులు చేర్పులు ఉండవచ్చు.
*11వ పిఆర్సి లో నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు*
** 🌷🚩
పూర్తి పెన్షన్ కు అర్హత కలిగిన సర్వీసు 33 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు కుదింపు.
రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు
గ్రామాలలో పని చేసేవారికి గతంలో ఇచ్చే 12 శాతం హెచ్ఆర్ఏ బదులు 15 శాతం HRA రెకమెండ్ చేసిన కమిషన్.
ఉపాధ్యాయులకు కూడా వృత్తి నైపుణ్యాలు పెంచుకునేందుకు తగిన మెటీరియల్ కొనడానికి వీలుగా స్పెషల్ పే రెకమెండ్ చేసిన కమిషన్.
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్లాబ్స్ ను
6 1218 24 నుండి 5 10 15 20 25 గా ఇవ్వాలని సూచించిన కమిషన్
🚩🌷
*ఆరుసార్లు గడువు తర్వాత ఎట్టకేలకు వేతన సవరణ నివేదిక సమర్పణ*
*వేతన సవరణ కమిషన్ 2018 మే 28న ఏర్పాటు*
*ఆరు సార్లు గడువు పొడిగించిన వేతన సవరణ కమిషన్ ఎట్టకేలకు సోమవారం తన పని వూర్తి చేసింది అక్టోబర్ 5న వేతన సవరణ నివేదికను సమర్పించింది. 2018లో వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆశుతోష్ మిశ్రాను కమిషనర్ గా ప్రభుత్వం 2018 జులై 3న నియమించింది ఈ సంఘానికి ఏడాది గడువు ఇస్తూ ఆ లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికి వేతన సవరణ నివేదిక కొలిక్కి వచ్చింది. చివరికి ప్రభుత్వానికి నివేదిక చేరింది ఇక అమలు ఎప్పటి నుంచి ఫిట్ మెంట్ ఎంత ఇతర సౌలభ్యాలు ఏమున్నాయనేది తేలాల్సి ఉంది. ఆరు సార్లు గడువు పెంపు.*
*2018 మే 28న 11వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.*
*అదే ఏడాది జులై 3న అశుతోష్ మిశ్రాను వేతన కమిషన్ గా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది లోప నివేదిక సమర్పించాలని సూచించారు.*
*2013 సెప్టెంబరు 30 వరకు మొదటిసారి కాలపరిమితి పొడిగించారు మరోసారి 2018 నవంబర్ 30 వరకు గడువు పెంచారు.*
*2020 జనవరి 31 వరకు వేతన సవరణ కమిషన్ గడువు పెంచారు.*
*మార్చి 31 వరకు మరోసారి గడువు పెంచారు.*
*తిరిగి జూన్ 30 వరకు కాలపరిమితి పొడిగించారు.*
*మళ్లీ సెప్టెంబరు 30 వరకు గడువు మరోసారి పొడిగించారు చివరికి అక్టోబరు 5న సమర్పించారు.*
**
0 Response to "11వ పిఆర్సి లో నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు"
Post a Comment