జాతీయ విద్యా విధానంపై నేడు సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ సోమవారం రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. 




కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. '



ఉన్నత విద్య రూపాంతరంలో ఎన్‌ఈపీ-2020 పాత్ర' పేరిట నిర్వహించే ఈ సమావేశంలో గవర్నర్లతోపాటు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు పాల్గొననున్నట్లు పేర్కొంది.


 పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా సంస్కరణలు తీసుకురావడం, భారత్‌ కేంద్రంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా తయారు చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యమని తెలిపింది

ఇందుకోసం దేశ వ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జాతీయ విద్యా విధానంపై నేడు సమావేశం"

Post a Comment