ఎస్.బి.ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్
భారతదేశంలో దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు తాజాగా తీపికబురు అందించింది.
మరీముఖ్యంగా లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు ఫ్రీకెన్సీని అంటే ఎంసీఎల్ఆర్ రీసెట్ కాలాన్ని తగ్గించినట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించినట్లు తెలిపింది. బ్యాంక్ నిర్ణయంతో లోన్ తీసుకున్న వారికి ఇది మంచి బెనిఫిట్. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఆర్బీఐ లేదా బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు త్వరితగతిన చేరుతుంది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది
రుణ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి ఏడాది వరకు వేచి చూడాల్సిన పని లేదు. ఎస్బీఐ తాజాగా ఎంసీఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది అని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఏఏ రుణాలకు వర్తిస్తుందో అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఎంసీఎల్ఆర్ లింక్డ్ ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్ సహా ఇతర రుణాలు తీసుకున్న వారికి రీసెట్ క్లాస్ ఉంటే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఇకపోతే బ్యాంకులు ఇటీవల కాలంలో రుణ రేట్లు తగ్గిస్తూ వచ్చిన విషయం తెలిసిందే
0 Response to "ఎస్.బి.ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్"
Post a Comment