జనగణన, ఎన్పీఆర్ ఈ ఏడాది లేనట్లే.
దిల్లీ: దేశంలో కరోనా కారణంగా వాయిదా పడిన మొదటి విడత జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఈ ఏడాదిలో జరిగే సూచనలు కనిపించడం లేదు. కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో ఏడాది ఆలస్యం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. జనగణన అనేది అంత అత్యవసరమైన ప్రక్రియేమీ కాదని, ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 2020లో జరిగే అవకాశమైతే లేదని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా వాస్తవానికి ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సి ఉంది.
0 Response to "జనగణన, ఎన్పీఆర్ ఈ ఏడాది లేనట్లే."
Post a Comment