ఆ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న వాట్సాప్
ఇంటర్నెట్డెస్క్: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇతర యాప్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని
నిలబడేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ఫీచర్పై వాట్సాప్ పనిచేస్తోందట. అదేంటంటే.. ఇప్పటివరకూ వాట్సాప్ అకౌంట్ను కేవలం ఒక డివైజ్లో మాత్రమే వినియోగించే వీలుంది. వెబ్ వాట్సాప్ ద్వారా డెస్క్టాప్నకు మాత్రం కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ, ఈ అకౌంట్తో మరో మొబైల్ లేదా ఇతర గాడ్జెట్లలో వినియోగించాలంటే కుదరదు.
అయితే, త్వరలోనే ఇది సాధ్యం కానుంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా నాలుగు డివైజ్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ను వినియోగించేలా యాప్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘అవును ఒకేసారి నాలుగు డివైజ్లలో వాట్సాప్ను వినియోగించవచ్చు.
ప్రస్తుతం దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయం’’ అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
వైఫై కనెక్షన్ ద్వారా ఇతర డివైజ్లోనూ వాట్సాప్ లాగిన్ అయ్యేలా దీనిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని ఆ తర్వాత మొబైల్ డేటా ఆప్షన్ కూడా జత చేసే అవకాశం ఉంది. కొన్ని ట్యాబ్లెడ్, హైబ్రీడ్ ల్యాప్టాప్లకు మొబైల్ కనెక్షన్ వెసులుబాటు ఉండదు. ఇలాంటి వాటిలో వాట్సాప్ వినియోగించాలంటే కష్టం. అయితే, ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే
, ఆ ఇబ్బందులు తప్పనున్నాయి
0 Response to "ఆ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న వాట్సాప్"
Post a Comment