ఉద్యోగం పోవడంతో అరటిపళ్లు అమ్ముకుంటున్న టీచర్.. ఆదుకున్న పూర్వ విద్యార్థులు
నెల్లూరు: ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఉపాధ్యాయుడు రోడ్డుపై అరటిపళ్లు అమ్ముకోవడం ప్రారంభించాడు. 3 వారాల నుంచి ఇదే తరహాలో అరటిపళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు చలించిపోయారు. వెంటనే తమ గురువును ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు.
అందరూ కలిసి రూ.86వేలకు పైగా చందాలు సేకరించి ఆయనకు అందించారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని నారాయణ స్కూల్లో వెంకట సుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు తెలుగు టీచర్గా పనిచేసేవారు. అయితే పాఠశాలలో కొత్త అడ్మిషన్లు చేయించడంలో ఆయన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దీంతో యాజమాన్యం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో జీవనాధారం కోసం దాదాపు 3 వారాలుగా రోడ్డుపై అరటిపళ్లు అమ్ముకుంటున్నారు.
తమ టీచర్ దుస్థితి తెలుసుకున్న దాదాపు 150మంది పూర్వ విద్యార్థులు రూ.86,300 సేకరించి అందించారు. దీంతో వెంకటసుబ్బయ్య ఎంతో సంతోషించారు. తాను తిరిగి ఉపాధ్యాయుడిగా కొనసాగాలనుకుంటున్నానని, తనకు సాయం చేసిన విద్యార్థులందరికీ ఎంతో కతజ్ఞతలనీ వెంకటసుబ్బయ్య చెప్పారు
0 Response to "ఉద్యోగం పోవడంతో అరటిపళ్లు అమ్ముకుంటున్న టీచర్.. ఆదుకున్న పూర్వ విద్యార్థులు"
Post a Comment