అంతర్రాష్ట్ర సర్వీసులకు ఏపీ పచ్చజెండా
అమరావతి:
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఏపీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు
బస్సులు నడపనున్నట్లు పేర్కొంది.
మొదట పరిమిత సంఖ్యలో 168 బస్సులను
నడపనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది
కర్ణాటకకు
వెళ్లే బస్సులను 4 దశల్లో 500కు పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం
ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి
కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
రేపటినుంచి ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని.. apsrtconline.in
ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది. బస్సుల్లో భౌతికదూరం, మాస్కులు
ధరించడం, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం
చేసింది
0 Response to "అంతర్రాష్ట్ర సర్వీసులకు ఏపీ పచ్చజెండా"
Post a Comment