పెరుగుతున్నకరోనా కేసులు... నిపుణులు ఏమంటున్నారంటే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం తాము మరోమారు లాక్డౌన్ పెట్టడం
లేదని స్పష్టం చేసింది. అయితే అన్లాక్తో కరోనా వైరస్ను కట్టడి
చేయలేమని నిపుణులు అంటున్నారు.
ఈ విషయమై ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్
సర్జరీ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
మాట్లాడుతూ కరోనా కేసులు పెరిగేకొద్దీ వైద్య అవసరాలు కూడా పెరుగుతాయని,
దేశంలో ఆ స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. ప్రస్తుతమున్న
పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అధికంగా పనిచేస్తున్న కారణంగా వారిపై
ఒత్తిడి పెరుగుతున్నదని అన్నారు.
పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత
దిగజారిపోతాయని అంచనావేశారు. అధిక సంఖ్యలో రోగులు, తక్కువ వైద్య సిబ్బంది
నెలకొన్న పరిస్థితుల్లో ఉన్నామన్నారు. దీనివల్ల వైద్య సిబ్బందిపై
ఒత్తిడి పెరగడంతోపాటు మరణాల రేటు కూడా పెరుగుతుందని హెచ్చరించారు.
అందుకే ఎవరికివారు స్వీయ నిర్బంధంలో ఉంటూ అవసరం ఉంటే తప్ప ఇల్లుదాటి
బయటకు వెళ్లవద్దని సూచించారు. అన్లాక్ కారణంగా దేశంలో కేసులు
పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంతోపాటు
పలుస్టేడియంలలో పడకలను ఏర్పాటు చేయగలరు గానీ, వైద్య సిబ్బందిని
సమకూర్చడం కష్టమైనపని అన్నారు.
కాగా లాక్డౌన్ ఎందుకు అమలు
చేస్తున్నారో అందరూ అర్థం చేసుకోవాలని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్
ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథి అన్నారు. కఠినమైన లాక్డౌన్ను
అమలు చేశారని, ఇది కరోనాకు పరిష్కారం కాలేదన్నారు. లాక్డౌన్ కారణంగా
చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. కరోనా కారణంగా ప్రతిరోజూ 400
మరణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అయితే పోషకాహార లోపం కారణంగా,
ఐదేళ్ల కంటే తక్కువ వయసు గల 2 వేల మంది పిల్లలు ప్రతిరోజూ
మరణిస్తున్నారని అన్నారు. ఇది ఇప్పుడు 5 వేలకు రెట్టింపు అయ్యిందన్నారు.
ప్రతి రోజు 6 వేల మంది హృద్రోగులు మరణిస్తున్నారన్నారు. మార్చి 25 న
దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు 536 కేసులు ఉండటంతోపాటు 11 మంది
మరణించారని ప్రొఫెసర్ బ్రహ్మమర్ ముఖర్జీ తెలిపారు. దీనిని చూస్తే
లాక్డౌన్ విజయవంతమైందనిపిస్తుందన్నారు. వైరస్ వ్యాప్తిని
నివారించడానికి ఒక వ్యూహం ఉండాలన్నారు. లాక్డౌన్ భారీ నష్టాలను
కలిగించిందన్నారు
0 Response to "పెరుగుతున్నకరోనా కేసులు... నిపుణులు ఏమంటున్నారంటే"
Post a Comment