టెన్త్లో పేపర్లు కుదిస్తూ ఉత్తర్వులు
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షల్లో పేపర్ల సంఖ్యను కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం
ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటి వరకు విద్యార్థులు 6 సబ్జెక్టులకు
సంబంధించి మొత్తం 11 పేపర్లలో పరీక్షలు రాస్తున్నారు.
అయితే కరోనా వైరస్
నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా జూలై 10 నుంచి
నిర్వహించతలపెట్టిన పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదిస్తున్నట్లు
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు పాఠశాల విద్య
ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వుల్చు జారీచేశారు
0 Response to "టెన్త్లో పేపర్లు కుదిస్తూ ఉత్తర్వులు"
Post a Comment