రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

అమరావతి : ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 




అయితే పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. పరీక్షల ఫలితాలను విడుదల చేసిన తర్వాత అధికారులు ఈ తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.



 కరోనా ఉన్నప్పటికీ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు


మరోవైపు పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించి తీరుతామని విద్యాశాఖా మంత్రి ఆది మూలపు సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా పలు రాష్ట్రాలు విద్యార్థులందర్నీ పాస్ చేస్తూ.. పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం నిర్వహిస్తామని, జరగవని వస్తున్న పుకార్లలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ తేల్చి చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు"