ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ి, అమరావతి: ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. 




ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

  • ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు మంత్రివర్గం ఉపసంఘం సిఫారసు
  • ఫైబర్‌ గ్రిడ్‌లో రూ.వెయ్యి కోట్ల టెండర్లలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు
  • చంద్రన్న కానుకలో అవినీతిపై కూడా దర్యాప్తునకు సిఫార్స్‌ చేసిన మంత్రివర్గ ఉపసంఘం
  • హెరిటెజ్‌ నెయ్యి కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సబ్‌ కమిటీ
  • ఫైబర్‌ గ్రిడ్‌లో టెరా సాఫ్ట్‌వేర్‌, వేమూరి రవిప్రసాద్‌ కేంద్రంగా అవినీతి జరిగినట్లు నిర్ధారించిన సబ్‌ కమిటీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు"

Post a Comment