పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు

న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచుతూ గ్యాస్ కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో సిలిండర్‌ ధరను రూ. 11.50కు పెంచారు. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నట్టు ఓ ప్రకటనలో గ్యాస్ కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి.



 గత మేలో రూ.744 ఉన్న రేటును రూ.581.50కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.593కు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులపై పెంచిన రేటు ప్రభావం ఉండదని తెలిపాయి. జూన్ 30 వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత సిలిండర్లు అందనున్నాయి. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.616, ముంబైలో సిలిండర్ ధర రూ.590, చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.606 పెరిగింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు"

Post a Comment