ఏపీలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 294 కేసులు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా బారిన
పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 15,633 మంది
నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య
ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు
ఇద్దరు ఉండగా..
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39 మంది
ఉన్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 253గా ఉంది.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,152కి చేరింది.
కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి
వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 84కి చేరింది.
ఇప్పటి వరకు
వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య
2,723కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,034 మంది చికిత్స
పొందుతున్నారు
0 Response to "ఏపీలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 294 కేసులు"
Post a Comment