త్వరలో ప్రశ్నపత్రాల నమూనా, పరీక్ష కేంద్రాల వివరాలు

రాష్ట్రంలో జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించ నున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్‌ సచివాలయంలోని తన చాంబర్‌లో వివరాలను ప్రక టించారు. 





ఆరు రోజుల పాటు పదో తరగతి పరీక్షలు, రెండు రోజుల పాటు ఓరియంటల్‌ ఎస్సెస్సీ, ఒకేష నల్‌ ఎస్సెస్సె  పరీక్షలు  జరుగుతాయన్నారు. 17వ తెదినాటికి పరీక్షలు ముగుస్తాయని మంత్రి వివరించారు. ఈదఫా 6 సబ్జెక్టులకు 6 పేపర్లు, ఒక్కొక్క పేపర్‌కు 100 మార్కుల చొప్పున ప్రశ్నాపత్రాలు ఉంటాయని తెలిపారు. సిలబస్‌ అంశాలను మాత్రమే ప్రశ్నపత్రంలో పొందుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ క్రమంలో 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించామని, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు. ప్రశ్నపత్రాల నమూనా, పరీక్ష కేంద్రాల వివరాలను త్వరలో ప్రక టిస్తామని తెలిపారు.

 . దాదాపు రెండు నెలల సమయం ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు సమా యత్తం కావాలని కోరారు. పరీక్ష కేంద్రాలను అదనంగా గుర్తించాలని డీఈవో, కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. 

విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు రాసే విధంగా పరీక్ష కేంద్రాల్లో సీట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో ప్రశ్నపత్రాల నమూనా, పరీక్ష కేంద్రాల వివరాలు"

Post a Comment