జీతాల తగ్గింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై న్యాయశాఖ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 26ను సవాల్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 



ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 300A లకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. 



ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, జీఏడీ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను చేర్చారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ సోమయాజులు బెంచ్ ముందుకు రానుంది
Source:ABN online news

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీతాల తగ్గింపుపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగి"

Post a Comment