పదో తరగతి పరీక్షలపై వదంతులు నమ్మవద్దు
_ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు
క్రోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రస్తుతానికి
వాయిదా వేసిన సంగతి విధితమే.
కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్
పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు
సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు
చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇలాంటి వదంతుల వల్ల
విద్యార్ధులు, తల్లిదండ్రులు జత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వదంతులు
పుట్టించినవారిపై, షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. విద్యార్థులు,
తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దని విద్యాశాఖ కమీషనర్ స్పష్టం చేశారు.
0 Response to "పదో తరగతి పరీక్షలపై వదంతులు నమ్మవద్దు"
Post a Comment