ఏపీలో సడలింపులపై మరిన్ని మార్గదర్శకాలు

విజయవాడ: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు నేపథ్యంలో దుకాణాలను తెరిచేందుకు అదనపు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌, బఫర్‌జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.



 కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, వస్త్ర, చెప్పుల దుకాణాలకు కూడా అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది




. అయితే దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దుకాణాల వద్ద విధిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీలో సడలింపులపై మరిన్ని మార్గదర్శకాలు "

Post a Comment