46 క్యాంపుల్లో ఇంటర్‌ స్పాట్‌

 ఇంటర్మీడియెట్‌ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 46క్యాంపులలో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఏటా జిల్లాకు ఒకటి చొప్పున 13 క్యాంపులు ఏర్పాటు చేసేవారు. కానీ కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈసారి 33 క్యాంపులను అదనంగా ఏర్పాటు చేశారు. 




కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుక్యాంపులు ఏర్పాటుచేశారు. మూల్యాంకనంలో పాల్గొనే ఎగ్జామినర్లు వీలైనంతవరకు ఎక్కువదూరం ప్రయాణించకుండా ఉండేందుకుగాను క్యాంపు ల సంఖ్యను పెంచారు. ఈ నెల 11న (అప్పటికి) గ్రీన్‌జోన్‌ జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు ఆరెంజ్‌ జోన్లయిన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా కోడింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. 

అంటే మొత్తం ఎనిమిది జిల్లాల్లో ముందుగా జవాబుపత్రాల కోడింగ్‌ ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి రెడ్‌జోన్‌లైన గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కోడింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు.


ఈ ప్రక్రియ పూర్తయినవెంటనే మూల్యాంకనం కూడా నిర్వహిస్తున్నారు.


 స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి రవాణా సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అలా చేయలేదు. సిబ్బంది సొంత వాహనాల్లోనే  క్యాంపులకు వస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎగ్జామినర్‌ రోజుకు 30 జవాబుపత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేలా ఇంటర్‌బోర్డు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియ దాదాపు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "46 క్యాంపుల్లో ఇంటర్‌ స్పాట్‌"

Post a Comment