ఏపీలో ఆర్టీసీకి రైట్‌ రైట్‌.. ఈ నగరాల నుంచే



అమరావతి: ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. కరోనాపై సమీక్షలో భాగంగా ఆర్టీసీ బస్సులు నడపడంపై ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ చర్చించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.



ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి తొలుత ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఈ సంఖ్య పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.


బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అలా వచ్చిన వారందరి పూర్తి వివరాలు సేకరించనున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేందుకు సగం సీట్లతోనే బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీటిపై విధివిధానాల రూపకల్పన చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు బస్సులు, రాష్ట్రంలో బస్సుల తిప్పే అంశంపై కూడా మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది. బస్సుల్లో 20 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ఆర్టీసీకి రైట్‌ రైట్‌.. ఈ నగరాల నుంచే"

Post a Comment