మే 31 వరకు లాక్ డౌన్ పొడగించిన కేంద్రం

మే 31 వరకు లాక్ డౌన్ పొడగించిన కేంద్రం


దిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది.

.

లాక్‌డౌన్‌ 4.0 లో వీటిపై నిషేధం కొనసాగుతుంది

* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.

* మెట్రో రైలు సేవలు

* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. అయితే, వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.

* ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచ్‌న్‌ తెరిచేందుకు అనుమతులు.

* బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు.

* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.

* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.

* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.

కంటైన్మెంట్‌ జోన్‌లు కాకుండా నిబంధనల మేరకు వీటికి అనుమతి

* రాష్ట్రాల మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి.

* అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి.

కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు

* ఎక్కడెక్కడ రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.

* రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.

* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.

* కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.

* 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు చిన్న పిల్లలను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు.

రాత్రి కర్ఫ్యూ
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.

ఆరోగ్య సేతు యాప్‌

* ఆఫీస్‌లు, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.

* స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరూ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలి

సరకు రవాణ

* నర్సులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సులకు, ఔషధ నిపుణులకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వారికి ఎలాంటి నిబంధనలూ ఉండవు.

* వస్తు రవాణ, కార్గో సేవలు, చివరకు ఖాళీ ట్రక్కులను అన్ని రాష్ట్రాలు అనుమతించాలి. వీటికి అడ్డు చెప్పకూడదు.

* పొరుగు దేశాల ద్వారా వచ్చే వస్తువులు, కార్గో సేవలను అందిస్తున్న అన్ని వాహనాలను రాష్ట్రాలు అనుమతించాలి.

* డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ప్రకారం ఇవన్నీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీటికి ఎలాంటి ఆటంకాలు కలిగినా డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌లు తగిన చర్యలు తీసుకోవాలి

Guidelins on the measures to be taken by Ministries/ Departments of

Government of India, Statel UT Govermments and Statel UT Authorities for


containment of COVID-19 in the country upto 31"May, 2020.

[As per Ministry of Home Affairs (MHA) Order No. 40-3/2020-DM- (A) dated 17"


May, 2020]

1. Lockdown shall continue to remain in force upto 31 May, 2020.

2. The following activitios shal continue to remain prohibited throughout


country:


i. All domestic and international air travel of passengers, except for domestic


medical services, domestic air ambulance and for security purposes o

purposes as permitted by MHA.

Metro rail services.


l.


ii. Schools, colleges, educationall training/ coaching institutions etc. will remain

CIOsed. Oniner distance learning Shall continue to be pemitted and shall be


encouraged.


iv. Hotels, restaurants and other hospitality services, except those meant Tor

housing health police Government ofticials nealtncare workers strande

persons including tourists and tor quarantine acilitesand running o

canteens at bus depots, railway stations and airports. Restaurants shall be


pemitted to operate kitchens for home delivery of food items.


v. All cinema halls, shopping malls, gymnasiums, swimming pools

Stadia w De pettd to Opel,

iall spors entertainment academic/ cultural/ religiouss

vii. All religious places/ places of worship shall be closed for public. Religious

3. The following activities shall be permitted with restrictions, except in the

i. Inter-State movement of passenger vehicles and buses, with mutual consent

i. Intra-State movement of passenger vehicles and buses, as deCided by the

I. Standard Operating Procedures (sOPs) tor movement of persons, as


entertainment parKS, neatres, Dars a


u


enactators


will not be allowed.


ctato


fneionsl


other aatherings and large congregations.


ontainment cones:


of the Stale(s} O(s) involved.


States andUis.


mentioned in Annexure, shall continue to operate.

National Directives for COVID-19 Management

National Directives for CoVID 19 Management, as specified in Annexure


Click here to download Guidelines





shall be followed throughout the country.




లాక్‌డౌన్‌ 4.0 నిబంధనలను జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ  (ఎన్‌ఈసీ) వెల్లడిస్తుందని తెలిపింది.




 అప్పటి వరకు ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని ఎన్‌డీఎంఏ పేర్కొంది







గమనిక

కేంద్ర తాజా మార్గదర్శకాలు కాసేపట్లో

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.



మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది


14 రోజుల పాటు పొడగింపు


లక్ డౌన్ 4 పై కాసేపట్లో మార్గదర్శకాలు


జోన్ల వారీగా సడలింపులు

: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4:0 మినహాయింపులకు సంబంధించి నేడు (శనివారం) కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. రెడ్‌జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.



మరోవైపు కంటైన్‌మెంట్‌ జోన్లో మినహా రవాణా వ్యవస్థకు సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.

రాష్ట్ర సరిహద్దులు దాటితే వైరస్‌ వ్యాప్తి ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో రైళ్లు, విమానాల ప్రయాణాలు ఇప్పుడే వద్దని కేంద్రానికి సూచిస్తున్నాయి. ఇక నాలుగో దశ లాక్‌డౌన్‌లో ముఖ్యంగా ఆర్థిక, వ్యవసాయాధారిత కార్యకలాపాలకు మరిన్ని సడలింపులు ఇచ్చే దిశగా కేంద్ర నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మరోవైపు వైరస్‌ ప్రభావం ఇప్పటితో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆంక్షలతో కూడిన ప్రజా రవాణాకు మొగ్గు చూపే అవకాశం ఉంది. వైరస్‌ ప్రభావిత ప్రభావిత ప్రాంతాలను బట్టి.. సెలెక్టివ్ ప్రాంతాల నడుమ విమాన సర్వీసులకు నడిపే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రెడ్‌జోన్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే వదిలివేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు గజాల దూరంతో విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, టాక్సీలు తిరగడానికి వీలు కలిపించే అవకాశం ఉంది. ఇక పరిమిత సామర్థ్యంతో స్థానిక రైళ్లు, మెట్రోలకూ అవకాశం కలించాలని ఢిల్లీ సర్కార్‌ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది.

అలాగే ఇటీవల ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎంలు చేసిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేయనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మే 31 వరకు లాక్ డౌన్ పొడగించిన కేంద్రం"

Post a Comment