రాష్ట్రంలో కేసుల సంఖ్య 2100కి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి మునుపటితో పోలిస్తే తగ్గినట్లే అనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా నమోదైన కేసులను బట్టి చూస్తే కరోనా విజృంభణ చాలా వరకే తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఏపీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. 24 గంటలుగా నమోదైన 36 కేసులతో కలిపితే రాష్ట్రంలో కేసుల సంఖ్య 2100కి చేరింది. ఇప్పటి వరకు 1192 డిశ్చార్జ్‌ కాగా.. 48 మంది మృతి చెందారు. ప్రస్తుతం 860 మందికి చికిత్స కొనసాగుతున్నది.



కొత్త కేసుల లెక్కలివీ..

గడిచిన 24 గంటల్లో 9,256 శాంపిల్స్‌ని పరీక్షించగా నెల్లూరు- 15, చిత్తూరు-09, గుంటూరు-05, కడప, కృష్ణా, శ్రీకాకుళం-02 చొప్పున.. పశ్చిమ గోదావరిలో ఒకే ఒక్క కేసు నమోదైంది. అయితే ఇన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి.. అయితే ఇవాళ మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇది కాస్త కర్నూలు జిల్లా వాసులకు ఉపశమనమే.


జిల్లాల వారీగా మొత్తం కరోనా కేసుల వివరాలు..:- 

కర్నూలు- 591

గుంటూరు-404

కృష్ణా-351

చిత్తూరు-151

నెల్లూరు- 126

అనంతపురం-118

కడప- 99

పశ్చిమ గోదావరి- 69

విశాఖపట్నం- 66

ప్రకాశం- 63

తూర్పుగోదావరి- 51.

శ్రీకాకుళం- 07

విజయనగరం- 04 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో కేసుల సంఖ్య 2100కి"

Post a Comment