భారత్‌లో కరోనా: 1783 మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం గత మూడురోజుల్లోనే దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 





గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 89మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య గురువారం నాటికి 52,952కు చేరగా 1,783 మంది 



మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267మంది కోలుకుని డిశ్ఛార్జి కాగా మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మహారాష్ట్రలో 16వేల కేసులు, 651 మరణాలు..

మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,233 కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరగా 651 మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలో ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,714కు చేరింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "భారత్‌లో కరోనా: 1783 మరణాలు"

Post a Comment