జీతాల్లో కోత విధించడంపై జగన్ సర్కార్కు సీపీఐ లేఖ
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కె. రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా పూర్తి
వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.
తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఇంటెన్సివ్ ఇవ్వాలని
డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గత సంవత్సరం కన్నా రు.30 వేల
కోట్లు అధికంగా ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సమంజసం
కాదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు
ఆపవద్దని,
అవసరమైతే వేతనాలను అడ్వాన్స్గా కూడా ఇవ్వాలని ప్రధాని మోడీ
సూచించారని గుర్తు చేశారు. లాక్డౌన్ సాకుగా చూపి ఉద్యోగుల జీతాల్లో కోతలు
విధించడం సరికాదన్నారు
0 Response to "జీతాల్లో కోత విధించడంపై జగన్ సర్కార్కు సీపీఐ లేఖ"
Post a Comment