లాక్డౌన్ ముగిసిన తర్వాత ‘పది’ పరీక్షలు కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ మంత్రి
అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో డిజిటల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సూచించారు.
రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో లాక్డౌన్ తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని..
ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లాక్డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత ఆ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తామని రమేశ్ పోఖ్రియాల్కు ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు
0 Response to " లాక్డౌన్ ముగిసిన తర్వాత ‘పది’ పరీక్షలు కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ మంత్రి"
Post a Comment