నేడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి

*నేడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి*
💐💐💐💐💐💐💐💐
జగ్జీవన్ రాం
జననం ఏప్రిల్ 5, 1908
రంగం సమరయోధులు, రాజకీయాలు,
పదవులు ఉప ప్రధానమంత్రి,
మరణం జూలై 6 1986
జగ్జీవన్ రాం ఏప్రిల్ 5, 1908న బీహార్‌లోని చంద్వాలో జన్మించారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.  జూలై 6 1986న జగ్జీవన్ రాం మరణించారు. జగ్జీవన్ రాం కూతురు మీరాకుమార్ 15వ లోకసభ స్పీకరుగా వ్యవహరించారు.

బాల్యం:
బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో చాంద్వా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908, ఏప్రిల్‌ 5న దళిత కుటుంబంలో జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు.



రాజకీయాలు:
జగ్జీవన్ రాం రాజకీయాలలో అంచలంచెలుగా ఎదిగారు. 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా పలు కేబినెట్‌ హోదాల్లో అనేక పదవులు అలంకరించినారు. భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా కూడా పనిచేశారు. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌’గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. భారతదేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనికుని ఉన్నది. ముఖ్యంగా కొన్ని కులాలు, ఆర్ధికంగా, రాజకీయంగా బలపడి "అగ్రకులాలు" గా పరిగణింపబడుతూ ఉన్నాయి. అగ్రకులాల లాగానే కొన్ని అణగారిన కులాలు ఉన్నాయి. ఈ కులాలవారిని దళితులనీ, నిమ్నజాతుల వారనీ, వెనుకబడిన  కులాల వారనీ పిలవటం కద్దు. ఈ కులాల యుగయుగాలుగా పేదరికంలో మ్రగ్గుతూ, జీవనం కోసం నిత్యం పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాయి. అగ్రకులాల కుల అహంకారానికి ఎన్నో కష్టనష్టాలు పడుతూ వస్తూ ఉన్నాయి.

           అటువంటి దళిత కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి చేరుకున్న వారు చరిత్రలో బహు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అటువంటి వారిలో పేరు పొందినవారు "బాబూ జగజ్జీవన్ రాం" గారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశస్వాతంత్రం కోసం పాటు పడ్డారు. ప్రజానాయకుడిగా పేరు పొందారు. సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు ఎన్నో పదవులు అధిష్టించినారు. పీడిత, తాడిత ప్రజలకు ఆశాజ్యోతిగా పేరు పొందారు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు. ప్రజలచేత ఆప్యాయంగా "బాబూజీ" అని పిలిపించుకున్నవారు. ఆ మహనీయుని గురించి బాలలూ, యువకులు తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. 🙏

 *

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి"

Post a Comment