Lock down వదంతులు పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.


*💫Lock down  వదంతులు పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం...*
👇👇
*లాక్‌డౌన్‌పై వదంతులు నిరాధారం*

దిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. ‘‘అలాంటి(లాక్‌డౌన్‌ పొడగింపు) ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ పొడగించే యోచనేమీ లేదు’’ అని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గత మంగళవారం 21రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశవ్యాప్తంగా జనసంచారంపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్‌డౌన్‌ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని వదంతులు వ్యాప్తించాయి. తాజాగా వీటిని కేంద్రం కొట్టివేసింది.
మరోవైపు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 1071కు చేరగా.. మృతుల సంఖ్య 29గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Lock down వదంతులు పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం."

Post a Comment