ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పెంపు

ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పెంపు*

★ కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

★ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. ఆధార్‌ పాన్‌ అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. 

★ టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9శాతానికి తగ్గించడంతో పాటు  వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. 

★ పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10శాతం అదనపు రుసుం ఉండదన్నారు. 

★ మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలాసీతారామన్‌ స్పష్టంచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువు పెంపు"

Post a Comment