ఐటీ రిటర్నుల దాఖలకు గడువు పెంపు
ఐటీ రిటర్నుల దాఖలకు గడువు పెంపు
దిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్ నెలకొన్న నేపథ్యంలో 2018- 19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ గడువును జూన్ 30 2020 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే లాక్డౌన్ విధించినట్టు చెప్పారు.
ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందన్న ఆమె.. ఆర్థిక సంవత్సరం చివరు రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందన్నారు
0 Response to "ఐటీ రిటర్నుల దాఖలకు గడువు పెంపు"
Post a Comment