ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు

*ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు*



అమరావతి: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఈనెల 31 వరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి వెల్లడించింది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే బ్యాంకు 



పనిచేస్తాయని స్పష్టం చేసింది. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సిబ్బంది అందుబాటు ఆధారంగా 50 శాతం మందితో 




పనిచేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. దీంతోపాటు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలికంగా బ్యాంకులు మూసివేయాలని బ్యాంకర్ల సమితి నిర్ణయించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు"

Post a Comment