లాక్‌డౌన్‌ తర్వాత ఎలా?

  • 11 ఉన్నత స్థాయి కమిటీల ఏర్పాటు


న్యూఢిల్లీ, మార్చి 30: కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగిసిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా? ఆస్పత్రుల నిర్వహణ ఎలా? పరిశ్రమల్లో తిరిగి ఉత్పత్తి ఏ స్థాయిలో జరగాలి? వంటి అంశాలపై కేంద్రం దృష్టిసారించింది. 



లాక్‌డౌన్‌ తర్వాత ఎదురయ్యే సమస్యలను 11 వర్గాలుగా విభజించిన కేంద్రం.. కేటగిరీల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో తొమ్మిదింటికి సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తుండగా.. ఒకదానికి నీతిఆయోగ్‌ సీఈవో, మరో కమిటీకి నీతిఆయోగ్‌ సభ్యుడు అధ్యక్షులుగా ఉండనున్నారు. ప్రతి కమిటీలో ఆరుగురు చొప్పున సభ్యులు ఉంటారు. 


ఈ కమిటీలు లాక్‌డౌన్‌ తర్వాత ఉత్పన్నం కానున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నివేదికలు సిద్ధం చేస్తాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "లాక్‌డౌన్‌ తర్వాత ఎలా?"

Post a Comment