కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.3వేల కోట్ల డీల్‌

  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’తో అమెరికా ఒప్పందం

న్యూఢిల్లీ, మార్చి 30 : కరోనా వ్యాక్సిన్‌ కోసం ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది. దీని విలువ రూ.3,438 కోట్లు. దీనికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(బార్డా), 

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా 2021 మార్చిలోగా 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సమకూర్చనుంది. కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలకు ఇప్పటికే ఆ కంపెనీ రూ.3,500 కోట్లను కేటాయించింది. తాజాగా అమెరికా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం(రూ.3,438 కోట్లు) కూడా 



లభించడంతో వ్యాక్సిన్‌ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.7వేల కోట్ల(1 బిలియన్‌ డాలర్ల)కు చేరింది. ఈనేపథ్యంలో సెప్టెంబరుకల్లా మనుషులపై ప్రయోగ పరీక్షలను ప్రారంభించి, వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్‌ అందిస్తామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. ప్రస్తుతం తాము పరీక్షిస్తున్న ఒక ‘లీడ్‌ క్యాండిడేట్‌ వ్యాక్సిన్‌’ అత్యుత్తమ ఫలితాలను అందిస్తోందని వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.3వేల కోట్ల డీల్‌"

Post a Comment