విద్యా కానుక’ కిట్ల కొనుగోలుకు ఉత్తర్వులు
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ కొనుగోలుకు పరిపాలనా సంబంధ అనుమతులు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కిట్ల కొనుగోలుకు మొత్తం రూ.655.60 కోట్లు వ్యయం కానుంది. సమగ్ర శిక్ష పథకం ద్వారా ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర వాటాగా రూ.262.24 (40ు) కోట్లు వెచ్చించనుంది. విద్యార్థుల డ్రాపౌట్స్ను తగ్గించడం, విద్యార్థుల్లో అభ్యాస ఫలితాలు పెంచాలన్న ధ్యేయంతో కిట్లను అందజేయాలని సర్కారు భావిస్తోంది.
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదివే 39,70,901 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తారు
0 Response to "విద్యా కానుక’ కిట్ల కొనుగోలుకు ఉత్తర్వులు"
Post a Comment